Thursday, May 15, 2008

మనిషి

ఒక వైపు ఆగ్రహించిన ప్రకృతి, మరొకవైపు వికటించిన తీవ్రవాదం, ఈ రెండు మానవ జాతి మనుగడకి ముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రకృతిని అడ్డుకునే శక్తి మానవునికి లేకపోయినా తనను తాను నాశనం చేసుకునే పధాన్నిమాత్రం మనిషి వీడాలి. కేవలం ఒక్క 20వ శతాబ్దంలోనే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 16.4 కోట్ల* మంది మానవులు యుద్ధాలవల్ల మరణించారు. ఈ సంఖ్య గత పంతొమ్మిది శతాబ్దాలలో మరణించినవారి సంఖ్యలో ఇంచుమించు మూడు వంతులు. దీనినిబట్టి పరిస్థితి ఎంత తీవ్రరూపం దాల్చిందో అర్ధం చేసుకోవచ్చు.

మనం ఇవాళ ఇలా సుఖంగా ఉండగలగడానికి, ఇంత సాంకేతిక అభ్యున్నతి సాధించడానికి మన పూర్వీకులు భవిష్య మానవులకోసం చేసిన నిస్వార్ధమైన శ్రమ, వారికి మనిషి మనుగడపైగల భాద్యత కారణాలు. నేటి తరం మనుషులకి అటువంటి సామాజిక భాద్యత, భవిష్యత్తు మానవుల గురించి తపన తగ్గిపోయాయి. ఎవరిస్వార్ధం వాళ్ళు చూసుకోవడం, మహాఅయితే వాళ్ళవాళ్ళ కుటుంబాల గురించి బాధపడటమే తప్ప సమాజం ఇంకా మానవజాతి గురించి పట్టించుకొనేవాళ్ళే కరువయ్యారు.

ఇకనైనా మనం మారాలి. లేకపోతే మానవులనే వాళ్ళు భూమిపై అంతరించిపోయే ప్రమాదం వుంది. ఈ కలహాలు, యుద్ధాలు మనకొద్దు. మనిషిని మనిషిగా ప్రేమిద్దాం. మనని మనం కాపాడుకొందాం.


* Source: Wikipedia



No comments: